telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ బోర్డును సీబీఐ ఛార్జ్ షీట్ లా చేశారు: అనురాధ ఫైర్

Panchumarthi-Anuradha

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డుని సీబీఐ ఛార్జ్ షీట్ చిట్టాలా చేశారని ఆరోపించారు. 36 మందికి దేవుడు సొమ్ము పంచిపెట్టే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. జగన్- కేసీఆర్ బినామీలకు పదవులను కట్టబెట్టి భక్తుల మనోభోవాలు దెబ్బతీశారని అనురాధా విమర్శించారు. టీటీడీ జంబో బోర్డు క్విడ్ ప్రోకో చిట్టా అంటూ ధ్వజమెత్తారు.

 ప్రస్తుతం టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులైన శేఖర్‌రెడ్డిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డిని నియనించినప్పుడు అతనిపై ఏ కేసు లేదన్నారు. ఈడీ కేసు పెట్టగానే శేఖర్‌రెడ్డిని తొలగించినట్లు చెప్పుకొచ్చారు. శేఖర్ రెడ్డిపై గతంలో రూ.100 కోట్లు కుంభకోణమని ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు మళ్లీ బోర్డు సభ్యుడిగా ఎలా నియమించారని అనురాధా ప్రశ్నించారు. స్థానికులకు 75శాతం అని చెప్పి టీటీడీలో ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు.

Related posts