telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్‌ అవగాహనా రాహిత్యం: అనురాధ

Panchumarthi-Anuradha

ప్రజావేదిక అక్రమ కట్టడమనడం ఏపీ సీఎం జగన్‌ అవగాహనా రాహిత్యమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. కోర్టులో ఉన్న అంశంపై సీఎం వ్యాఖ్యలు సరికావని చెప్పుకొచ్చారు. కనీస సమాచారం ఇవ్వకుండా ప్రజావేదిక నుంచి సామాన్లు బయట పడేశారన్నారు. ప్రభుత్వ కట్టడం గురించి మీకు చెప్పాల్సిన పని లేదంటున్నారని ఆమె తెలిపారు.

అక్రమ కట్టడంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? అని ఈ సందర్భంగా అనురాధ ప్రశ్నించారు. ఇదే ప్రదేశంలో స్వరూపానంద యాగం చేస్తే ఇద్దరు సీఎంలు వెళ్లి గంటలు.. గంటలు కూర్చున్నారు. వాళ్లకు ఎందుకు అనుమతి ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటం లేదని, వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందిని అనురాధ చెప్పుకొచ్చారు.

Related posts