telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వైసీపీ ఊహల్లో విహరిస్తోంది: ఆనంద్‌బాబు

TDP Change Puthalapattu Candidate
రాష్ట్రంలో వైసీపీ ఊహల్లో విహరిస్తోందని టీడీపీ నేత ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనివిశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని విమర్శించారు.
 వైసీపీ ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే ఈసీ చర్యలు తీసుకుందని, అదే ఓట్ల గల్లంతుపై టీడీపీ ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ స్పందించలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం చెప్పుచేతల్లో ఈసీ పనిచేస్తోందన్నారు. వీవీప్యాట్స్‌ లెక్కించమంటే ఈసీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దేశవ్యాప్త పోరాటం చేస్తున్నారని ఆనంద్‌బాబు తెలిపారు.

Related posts