కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి అఖిలప్రియ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని కిషన్ రెడ్డి నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరిగింది. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో తాజా పరిణామాలు.. ముఖ్యంగా దివంగత నేత కోడెల శివప్రసాద్పై పెట్టిన కేసుల విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి గల్లా తీసుకెళ్లారు. కర్నూలులో రాజకీయదాడులు చేస్తున్నారని అఖిలప్రియ ఫిర్యాదు చేశారు.
ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితులు చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలని కిషన్ రెడ్డిని కోరారు. గల్లా, అఖిల ప్రియ ఫిర్యాదులు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్.. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ విషయాలపై లోతుగా చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.