గుంటూరు జిల్లాలో పాతకక్షల కారణంగా ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గురజాల మండలంలోని అంబాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్ గత అర్ధరాత్రి బైక్పై వెళ్తుండగా మాటువేసిన ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేశారు.
ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాతకక్షలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.