వైసీపీ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడితే ఒక్క వైసీపీ నేత కూడా బయట ఉండేవారు కాదనిఅన్నారు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడరని పేర్కొన్నారు. అవినీతి చేసి జైలుపాలయిన జగన్ వంటి నేతలు సిగ్గుపడాలన్నారు. అక్రమ కేసులకు బదులు ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఓటమిని ఎవరూ కూడా ఊహించలేకపోయారన్నారు.
దేశంలో వైసీపీ వంటి శాడిస్ట్ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలను వేధించడం ఆపాలని ఆనరు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, వారి రక్షణకు మా ప్రాణాలు ఫణంగా పెడతామని చెప్పారు. అవసరమైతే జోలె పట్టి కార్యకర్తలను ఆడుకుంటామని పేర్కొన్నారు.