telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై జరిగి దాడిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమ, హైకోర్టు న్యాయవాది కిశోర్ లపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ రాక్షస పాలనకు మాచర్ల ఘటన పరాకాష్ఠ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందన్నారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నాయకులను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

హైకోర్టు న్యాయవాది కిశోర్ పై ఘోరంగా దాడి చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి కూడా వీల్లేదంటూ అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి, ఎస్కార్టుగా వచ్చిన పోలీసులపైనా వైసీపీ రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందనిలోకేశ్ మండిపడ్డారు.

Related posts