telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలిలో తమ దెబ్బకు జగన్ దిమ్మ తిరిగింది: బచ్చుల అర్జునుడు

bachula Arujunudu

శాసనమండలిని రద్దు చేసే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. ప్రభుత్వం శాసనసభలో కేవలం తీర్మానం మాత్రమే చేయగలదని చెప్పారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిలో తమ దెబ్బకు జగన్ దిమ్మ తిరిగిందని విమర్శించారు.

శాసనమండలిలో జరిగిన పరిణామాలు, మండలి రద్దు అంశంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మండలి గురించి అసెంబ్లీలో చర్చించకూడదని అన్నారు. రేపటి అసెంబ్లీ సమావేశానికి హాజరుకాకూడదదని టీడీఎల్పీ నిర్ణయించిదని పేర్కొన్నారు. 

Related posts