వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం “బ్రోచేవారెవరురా”. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన రెండో చిత్రం “బ్రోచేవారెవరురా”. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటించగా… ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన “బ్రోచేవారెవరురా” సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా “బ్రోచేవారెవరురా” సక్సెస్మీట్లో పాల్గొన్న తరుణ్ బాస్కర్ మాట్లాడుతూ “ఈ ఏడాదిలో మేము చూసిన గొప్ప చిత్రం బ్రోచేవారెవరురా అని మా టీమ్లో చాలా మంది చెబుతున్నారు. నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు ఆతృతగా ఎదురుచూస్తున్నా. టికెట్లు దొరకట్లేదు. అందుకే దర్శకుడు ఆత్రేయకు వంద రూపాయలు ఇస్తున్నా. నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నాకు యాభై రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి. నాకు ఒక టికెట్ కావాలి. ఏఎంబీకి వెళ్లి చూస్తా. ఫిల్మ్ స్కూల్ యూనివర్సిటీలో అందరూ కలిసి సినిమాలు చేస్తున్నట్టు ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ప్రతి వారం మంచి సినిమాలు రావాలి. పాన్ ఇండియా లెవెల్లో గర్వించదగ్గ తెలుగు సినిమాలు రావాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
previous post
next post
చైనా యాప్స్, దేశభక్తిపై సంచలన వ్యాఖ్యలు… వర్మ ఓపెన్ ఛాలెంజ్