నానాపటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తాకు చుక్కెదురైన విషయం తెలిసిందే. నానాపటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు ఏం దొరకనందున ఈ కేసు విచారణను ముగిస్తున్నామని తెలిపిన ముంబై పోలీసులు నానా పటేకర్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ విషయంపై తనుశ్రీ దత్తా స్పందించింది. పోలీస్, న్యాయవ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించింది తనుశ్రీ. ఈ రెండు వ్యవస్థలు వాటికంటే ఎక్కువ అవినీతిపరుడైన వ్యక్తి (నానాపటేకర్ ను ఉద్దేశించి)కి క్లీన్ చిట్ ఇచ్చాయని ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె నానా పటేకర్ పై చేసిన వ్యాఖ్యలకన్నా దేశంలోని రెండు కీలక వ్యవస్థలపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
previous post
next post
అలాంటి నిర్మాతలు నా దగ్గరకు రావొద్దు… త్రివిక్రమ్ ను నేనే హైదరాబాద్ తీసుకొచ్చా.. : సునీల్