లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకొక్కరూ గులాబీ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్, పరిషత్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్బై చెప్పి కారెక్కేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపిన రోహిత్ రెడ్డి నేడు కేటీఆర్ను కలవబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీ మారే అవకాశమున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో బిజీగా ఉంది. హుజూర్నగర్లో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది.
రాబర్ట్ వాద్రాను వదిలేది లేదు: మోదీ