telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

తానా ఉత్సవాలు .. ప్రారంభం.. ఏపీనుండి పాల్గొన్న పలువురు నేతలు ..

tana utsav started in washington

తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 22వ మహాసభలు వాషింగ్టన్‌ లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షుడు సతీశ్ వేమన-నీలిమ దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తొలిరోజు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ లీడర్‌షిప్’ అనే అంశంపై కపిల్‌దేవ్ మాట్లాడగా, రెండో రోజైన శుక్రవారం 150 మంది చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపకం ఆహూతులను ఆకట్టుకుంది. వాషింగ్టన్ వీధుల్లో మేళతాళాలతో పరేడ్ నిర్వహించారు.

ఏపీనుండి నుంచి ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీలు సీఎం రమేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్‌, విశ్వంజీ, పరిపూర్ణానంద స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.

Related posts