telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తప్పు చేస్తే ఊరుకునే ప్రభుత్వం కాదు: తమ్మినేని

AP assembly speaker Tammineni

మాది తప్పు చేస్తే ఊరుకునే ప్రభుత్వం కాదంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయనప్పుడు దేవుడ్ని అయినా ఎదిరిస్తామని ధీమాగా చెప్పారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ప్రజా జీవితం నుంచి వైదొలగడానికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. వరుణదేవుడికి వైసీపీకి సంబంధం ఉందంటే, చంద్రబాబుకు మండుటెండలకు, కరవుకు సంబంధం ఉన్నట్టేనని అన్నారు. ఇసుక విషయంలో టీడీపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని స్పీకర్ వ్యాఖ్యానించారు.

Related posts