ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు అనూహ్య ఘటన చోటుచేసుకొంది. సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో పదేపదే టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనస్తాపం చెంది, తన స్థానం నుంచి లేచి వెళ్లిపోయారు. స్పీకర్ చైర్ ను వదిలి వెళ్లడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
స్పీకర్ చైర్ ను అగౌరవ పరుస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గు పడాలని అన్నారు. కీలక చట్టాలను చేస్తున్న సమయంలో విపక్షాలకు ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే, తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని, అయినా, చైర్ ను అవహేళన చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలబడాల్సిన సభలో ఈ పరిస్థితిని తాను ఊహించలేదని అన్నారు.