తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. “కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర ప్రజలందరికి మద్దతుగా నిలుస్తున్నాను. కరోనాపై పోరుకు నా వంతు భాగస్వామ్యంగా ఒక నెల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ రూపంలో అందించనున్నాను” అంటూ తమిళిసై ట్వీట్ చేశారు.
కాగా, కరోనా ప్రభావంతో తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను 1500 మందికి క్వారంటైన్ చేసేలా చర్యలు చేపడుతున్నారు.
అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించా: చంద్రబాబు