ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రంపై తమిళ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. తమిళనాడులో హిందీ అక్షరాలు కనిపిస్తే చాలు నిరసనకారులు నల్లరంగు పూస్తున్నారు.
తాజాగా తిరుచ్చిలోని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలపై నల్లరంగు పూశారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, పోస్టాఫీసులు, తిరుచురాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలను నల్లరంగుతో పూర్తిగా కప్పేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. సైన్బోర్డులపై నల్లరంగు పూసిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.