తమిళ సినిమా మాజీ డైరెక్టర్, నటుడు కే భాగ్యరాజా “కరుతుకలై పతివు సై” సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొబైల్ ఫోన్స్ వాడడం వలననే స్త్రీలు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని భాగ్యరాజ్ అన్నారు. అంతేకాదు ఓ మగవాడు ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకుంటే, ఆమెను సంతృప్తిపరించేందుకు అతను అన్నీ చేస్తాడని, ఆ సమయంలో భార్యను ఏ విధంగాను ఇబ్బంది పెట్టడని చెప్పాడు. ఒకవేళ మహిళ ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే, అప్పుడు ఆమె తన లవర్తో కలిసి భర్తను, పిల్లల్ని చంపే ప్లానేసిన లాంటి వార్తలను చదవాల్సి వస్తుందన్నారు. అందుకే మహిళలను అదుపులో ఉంచాలని భాగ్యరాజా తన స్పీచ్లో తెలిపాడు. అయితే ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. భాగ్యరాజాపై కఠిన శిక్షలు విధించాలని తమిళనాడు ఉమెన్ కమీషన్కి లేఖ రాసింది. దీనిపై స్పందించిన కమీషన్ చైర్పర్సన్ కన్నగి ప్యాకియానాథన్ ..డిసెంబర్ 2న తన ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కూడా వారు పేర్కొన్నారు.
previous post
next post