యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ను రాబట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్లపరంగా ఇప్పుడు 100 కోట్ల క్లబ్లోకి చేరింది. హీరోయిన్, పాటలు వంటివి లేకుండా కేవలం కథే ప్రాణంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కార్తీ కెరియర్లో 100 కోట్లు సాధించిన చిత్రమిదే కావడం విశేషం. ఈ చిత్రంలో ఢిల్లీగా నటించిన కార్తీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నగా తెలుస్తోంది. ఇటీవల ‘ఖైదీ’ సక్సెస్ మీట్లో హీరో కార్తీ.. ‘మీ అందరి కోసం ఢిల్లీ మళ్ళీ వస్తాడు’ అని తెలిపిన విషయం తెలిసిందే.
previous post
సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. మాధవీలత షాకింగ్ పోస్ట్