లాక్డౌన్తో షూటింగ్లు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన సెలెబ్రిటీలు ఈ సమయంలో వర్క్ అవుట్స్ చేయడంతోపాటు, వంటలు కూడా ట్రై చేస్తూ ఛాలెంజెలు విసురుతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయాలనే కాన్సెప్ట్తో ప్రారంభమైన బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు పలువురు హీరోయిన్లు పిల్లో చాలెంజ్ పేరుతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లు పాయల్ రాజ్పుత్, పరుల్ యాదవ్, సింగర్ నేహా కక్కర్ ఈ చాలెంజ్ను పూర్తి చేశారు. కేవలం పిల్లో మాత్రమే ధరించిన ఫొటోలను వారు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పిల్లో చాలెంజ్ను స్వీకరించారు. పిల్లో చాలెంజ్ను పూర్తి చేసిన తమన్నా.. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమన్నా పిలో చాలెంజ్ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.