ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్లతో బిజీబిజీగా ఉండే వీరు ప్రస్తుతం ఖాళీ సమయాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన ఇంట్లో చక్కగా విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా తమన్నా ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో షేర్ చేసింది. టీ-షర్టు వేసుకుని ప్రశాంతంగా కూర్చుని రిలాక్స్ అవుతున్న తన ఫొటోను పోస్ట్ చేసింది. “అంతా అయిపోయాక నిద్ర లేపండి” అని కామెంట్ చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సినిమాలోనూ, బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమాలోనూ నటిస్తోంది.
previous post
రజినీకాంత్, కమల్ హాసన్ లపై కట్టప్ప వ్యాఖ్యలు