బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభమై 15 మంది కంటెస్టెంట్స్తో ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బయటకి వెళ్ళగా, రెండో వారం జాఫర్ని ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌజ్లో 14 మంది సభ్యులు ఉండగా… ఈ వారం నామినేషన్లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్లు ఎలిమినేషన్లో నిలిచారు. రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో అడుగుపెట్టిన ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్లో ఉన్న పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షెరు సేఫ్ జోన్లోకి వెళ్లిపోగా తమన్నా ఎలిమినేట్ అయింది. ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున తమన్నా పేరు చదవగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన కన్నీళ్లు బాబా భాస్కర్ కోసమేనని, ఆయన లాంటి తండ్రి తనకు ఉంటే బాగుండునని పేర్కొంది. బిగ్బాస్ షోకి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. షోకి రావాలన్న తన కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. బాబా భాస్కర్కు తాను కూతురిని అయి ఉంటే సూపర్ లేడీని అయి ఉండేదాన్నని కన్నీళ్లు పెట్టుకుంది. కాగా షో మధ్యలో నటుడు వెన్నెల కిశోర్ సందడి చేశాడు. మన్మథుడు-2 ట్రైలర్ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన వెన్నెల కిశోర్ హౌస్మేట్స్ను కడుపుబ్బా నవ్వించాడు.
previous post
బ్రేక్ లేకుండా 30 గంటలు చేయగలను : రకుల్ ప్రీత్ సింగ్