మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం సంపత్ నంది, హీరో గోపించంద్తో తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటిస్తోంది. ఇక సత్యదేవ్ తో ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు హిందీలో ‘బోల్ చుడియాన్’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలొ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం తమన్నా ఈ వెబ్ సిరీస్ చేస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘లెవంత్ అవర్’ అనే వెబ్ సిరీస్ లో తమన్నా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా… రితేష్ దేశ్ముఖ్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రితేష్ మళ్లీ నిర్మాతగా మరనున్నారు. అతడు ఓ హస్య ప్రధాన చిత్రాన్ని రూపొందించేందుకు సిద్దమయినట్లు సమాచారం. అందులో హీరోయిన్గా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా అవకాశం దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పక్కా కామెడీ సినిమాగా తెరకెక్కించి, ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రితేష్ అండ్ టీమ్ అనుకొంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఇటీవల రితేష్ టీమ్ తమన్నాకు కథను వినిపించారని, అందుకు తమన్నా కూడా సానుకూలంగా స్పందించారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని, త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన చేయనున్నట్లు యూనిట్ తెలిపింది.
previous post