telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మహాసముద్రం”లో శర్వానంద్ కు జోడిగా ఐశ్వర్య

Ishwarya-Rajesh

“ఆర్‌ఎక్స్ 100” సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి “మహాసముద్రం” పేరుతో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో “మహాసముద్రం” సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గ‌మ్యం’ చిత్రాల త‌ర్వాత శ‌ర్వానంద్ చిర‌కాలం గుర్తుండిపోయే ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, బ‌ల‌మైన పాత్రను చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయ‌బోతున్నందుకు శ‌ర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు. ఇంటెన్స్ ల‌వ్‌-యాక్షన్ డ్రామాగా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని సుంక‌ర రామ‌బ్రహ్మం తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గితే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని దర్శకుడు కాచుకు కూర్చున్నాడు. మరోవైపు ప్రస్తుతం చేస్తున్న శ్రీకారం సినిమా పూర్తి అయిన శర్వా ‘మహా సముద్రం’ సినిమాను చేయబోతున్నాడు. మహాసముద్రం సినిమాలో శర్వాకు జోడీగా సమంత నటించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా వచ్చాయి. కాని చివరకు ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కాస్త గ్లామర్ కూడా ఒలకబోయనుందని తెలుస్తుంది. నటనకు ఆస్కారమున్న పాత్రకావడంతో ఐశ్వర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related posts