telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య : మంత్రి తలసాని

talasani srinivasayadav on clp merger

వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హైద్రాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. దాడి ఘటనపై వైద్యులను వివరాలు అడిగితేలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైద్యులపై ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గాంధీ ఆస్పత్రి వైద్యులకు భరోసా కల్పించినట్లు ఆయన తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా పికెట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దన్నారు. గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల యాచకులను తరలించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరిని దాదాపు గుర్తించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

Related posts