కరోనా నివారణ కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారి రా ష్ట్రంలో విస్తరిస్తుంటే వాటిని పక్కనబెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్పార్టీ నేతలు సీఎం పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలు ఎన్ని సార్లు బుద్దిచెప్పినా కాంగ్రెస్ నేతల్లో మార్పురావడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం పై విమర్శలు చేసే వారు ఇన్నిరోజులుగా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో కాంగ్రెస్ నేతలు తెలుసుకుని మాట్లాడాలని హితవు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారినే ముఖ్యమంత్రి విమర్శించారని, కాంగ్రెస్ అధికారుంలో ఉన్నప్పుడు మీడియా పట్ల వ్యవహరించిన తీరు, ఇచ్చిన గౌరవం ఏమిటో అందరికీ తెలుసునని అన్నారు.
అందుకే ఆయనను పెళ్లి చేసుకున్నా: మంత్రి పుష్ప శ్రీవాణి