telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్లాట్‌ కొనుకున్న తాప్సి… ఫోటోలు వైరల్‌

ఝుమ్మంది నాదం సినిమాతో  తాప్సి తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తనదైన నటనతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును పొందింది. లేడీ ఓరియాంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి వరుస సినిమాలు చేస్తోంది. ఆ సినిమాల్లోని పాత్రలకు కావలసిన విధంగా తనను తాను మార్చుకుంటూ అందరిని అబ్బురపరుస్తోంది.  ప్రస్తుతం అక్కడ కూడా చాలా సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. డిఫరెంట్‌ పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ ప్రస్తుతం.. రష్మీ రాకెట్‌, శభాష్‌ మిథు లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సినిమాల కోసం తాప్సీ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. పాత్రలో ఒదిగిపోయేందుకు అహర్నిషలు కృష్టి చేస్తుందట. అయితే ఈ ఢిల్లీ బ్యూటీ రీసెంట్‌గా ముంబైలో ఇల్లు కొనుగోలు చేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇంటి ఫోటోలు షేర్‌ చేసి.. నెటిజన్స్‌ను థ్రిల్‌ చేసింది తాప్సి. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నయా ఘర్ ను డిస్క్రైబ్ చేస్తూ తాప్సీ రాసిన మాటలు అందరి భలే ఆకట్టుకున్నాయి. ఇల్లంటే స్నేహితులు కలిసే చోటు, బంధువులతో వేడుకలు జరుపుకునే చోటు, ప్రేమ ఉత్పన్నమయ్యే చోటు అని తాప్సీ చెప్పడం బాగుందంటూ నెటిజన్లు కితాబిచ్చారు.

Related posts