telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ లో దారుణం : వ్యక్తిని హతమార్చి ఫ్రిడ్జిలో పెట్టిన దుండగులు

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా క్రైం రేట్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు హత్యలు, రేప్‌లు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. చిన్న గొడవలకు కూడా మర్డర్‌ చేసే వరకు పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ కార్మిక నగర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. మహమ్మద్‌ సిద్ధిక్‌ (35)అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ భవంతిలో టైలరింగ్‌ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దుండగులు సిద్ధిక్‌ని దారుణంగా హత్య చేసి అతడి ఇంటిలోని ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య రుబీనా,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వెనుక అసలు కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts