telugu navyamedia
సినిమా వార్తలు

“విరాటపర్వం” నుంచి టబు తప్పుకుందా ?

Tabu

రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “విరాటపర్వం 1992”. “నీది నాది ఒకే కథ” ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక ప‌రిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెర‌కెక్కించ‌నున్నాడు. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, సాయి ప‌ల్ల‌వి టీంతో ఇటీవ‌ల క‌లిసింది. ఇందులో ప్రముఖ నటి టబు మానవ హక్కుల పోరాట నాయకురాలిగా కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపస్తున్నాయి. చేతి నిండా ఉన్న ప్రాజెక్టుల కారణంగా డేట్లు సర్దుబాటు కాకపోవడంతో టబు ఈ సినిమా నుంచి తప్పుకుంటోందట. ఆమె స్థానంలో బాలీవుడ్‌ నటి నందితా దాస్‌ నటించనున్నట్లు టాక్‌. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

Related posts