తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మిల్కీ బ్యూటీకి కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది తాప్సీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది తాప్సీ. ఇటీవలే “గేమ్ ఓవర్” చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి ఇప్పుడు గుజరాత్కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయణంకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది తాప్సీ.
తాప్సీ తన సోదరి షగున్తో కలిసి ఓ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు పేర్కొంది. అయితే తాను ప్రేమించే వ్యక్తి నటుడు, క్రికెటర్ కానే కాదు. అసలు భారతీయుడే కాదు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. “నా వలననే తాప్సీకి ప్రియుడు దొరికాడు. అందుకు తాప్సీ కృతజ్ఞతలు తెలపాలి. ఆ వ్యక్తి చాలా విచిత్రమైన మనిషి. అతనని ఎలా ఇష్టపడిందే అర్ధం కావడం లేదు” అంటూ సరదాగా పేర్కొంది తాప్సీ సోదరి షగున్. తాప్సీ చెబుతున్న వ్యక్తి డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోనా అని అందరూ అనుకుంటున్నారు. “ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్న తర్వాతే నాకు నా రాజకుమారుడు దొరికాడు’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది తాప్సీ. అయితే ‘నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కాకుండా మాత్రం పిల్లల్ని కనను. అలాగని నా పెళ్లి ఆడంబరాలతో ఉండకూడదు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా జరగాలి” అని ఆమె స్పష్టం చేసింది.
మొదటి నుంచీ అయోమయ ప్రకటనలు… కరోనా నుంచి ఉపశమనం ఎప్పుడు… : విజయశాంతి