తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మిల్కీ బ్యూటీకి కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది తాప్సీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది తాప్సీ. ఇటీవలే “గేమ్ ఓవర్” చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి ఇప్పుడు గుజరాత్కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే `పింక్`, `మిషన్ మంగళ్` వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తాప్సీ తాజాగా కౌంటర్ వేసింది. తాప్సిని కంగన సోదరి రంగోలీ ఇప్పటికి చాలా సార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. కంగనను తాప్సీ కాపీ కొడుతుందని రంగోలీ విమర్శించింది. ఆ తర్వాత కూడా తాప్సీపై ఆమె విమర్శలు కొనసాగించింది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నేహా ధూపియా నిర్వహించే కార్యక్రమానికి తాజాగా హాజరైన తాప్సీ.. రంగోలీ విమర్శలపై స్పందించింది. “కంగన, రంగోలీకి నేనంటే చాలా ఇష్టం. అందుకే వారి జీవితాల్లో చాలా సమయాన్ని నా కోసం కేటాయిస్తుంటారు. నిజం చెప్పాలంటే వారికి నాపై ఉన్నంత ఇష్టం.. వారిపై నాకు లేదు. అందుకే వారి కోసం నేను తగినంత సమయం కేటాయించలేకపోతున్నా. వారు నాపై చేసే విమర్శలకు నేను ప్రాధాన్యం ఇవ్వను. నా పనులకు వారి విమర్శలు అడ్డంకి కాదు. నాకు నచ్చిన వ్యక్తుల మాటలను మాత్రమే నేను పట్టించకుంటాను” అని తాప్సీ చెప్పింది.
next post