తెలంగాణలోని కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ మడలంలోని కొత్త సార్సాల అటవీ అధికారుల పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిని ఖండించిన టీ కాంగ్రెస్ నేడు కొత్త సార్సాల గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యన మంచిర్యాలలో కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మేల్యేలు జగ్గారెడ్డితో పాటు జీవన్రెడ్డి, సీతక్క, శ్రీధర్బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, అటవీ అధికారులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ నివేదికను రూపొందించి గవర్నర్కు అందజేస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జగ్గారెడ్డి ఆరోపించారు.
ప్రపంచ కప్ గెలవకపోతే… తాను నిరాశకు గురవుతా: అజార్