telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

డబ్బులు రాకపోవడంతో ఏటీఎం మిషన్‌ ధ్వంసం

Broken Cash machine

డబ్బులు రాకపోవడంతో ఓ యువకుడు ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన కడప నగరం మోచంపేట శివాలయం ఎదురుగా ఉన్న సిండికేట్‌ బ్యాంకు ఏటీఎం వద్ద జరిగింది. ఏటీఎం మిషన్‌లో డబ్బులు డ్రా చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన సుధీర్‌కుమార్‌రెడ్డి వెళ్లాడు. అయితే ఏటీఎంలో డబ్బులు రాకపోవడంతో సిలిండరు తీసుకువచ్చి ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. దీంతో మిషన్‌ స్క్రీన్ తో పాటు బ్యాటరీ డబ్బులు వచ్చే మిషన్‌ అంతా పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు. సిండికేట్‌ బ్యాంకు మేనేజరు మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ మేరకు సుధీర్‌కుమా్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

సిండికేట్‌ బ్యాంకుకు సంబంధించి ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం తెలుసుకున్న జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరు ఆంజనేయచారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏటీఎం మిషన్‌ ధ్వంసమైన సంఘటన పరిశీలించి చుట్టుపక్కల వారిని అడిగి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటీఎం మిషన్లలో డబ్బులు రాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాని తెలిపారు.

Related posts