సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కొత్త రికార్డులను క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. అయితే లేటెస్ట్గా వినపడుతున్న సమాచారం మేర సైరా డిజిటల్ హక్కులు కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయట. వివరాల ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.40కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. ఇంత మొత్తంలో డిజిటల్ హక్కులను దక్కించుకున్న దక్షిణాది చిత్రమిదేనని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమా విడుదల తరువాత మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
previous post
పాప పోలిక విషయమై సమీరారెడ్డిపై విమర్శలు