మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్, పాటలు సహా అన్నీ చిత్రీకరణకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. “సైరా షూటింగ్ పూర్తి. టీంలో ప్రతి ఒక్కరికీ థాంక్స్. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మెమొరబుల్ జర్నీ. సినిమా చాలా బాగా వచ్చింది. డిఐ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది” అంటూ పోస్ట్ చేశారు రత్నవేలు.
previous post