మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ నెల 14వ తేదీ నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రానున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న అభిమానులకు, ప్రేక్షకులకు `సైరా నరసింహారెడ్డి` మేకింగ్ వీడియో విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాలకు ఈ వీడియో విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ హిస్టారికల్ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.
previous post
మూవీ మాఫియా “మణికర్ణిక”ను చంపాలనుకుంది… కంగనా సంచలన వ్యాఖ్యలు