telugu navyamedia
సినిమా వార్తలు

సైరా : వీఎఫ్‌ఎక్స్‌ పనుల్లో బిజీ…!

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. ఈ సినిమాలో హిందీ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు, తెలుగు నటుడు జగపతిబాబు, కన్నడ నటుడు సుదీప్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, నయనతార ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌ అవసరమయ్యే సన్నివేశాలను ఎప్పుడో చిత్రీకరించారు. ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్‌ చేశాక… ఆ సన్నివేశాల్లో ఏమాత్రం తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటున్నారట. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

Related posts