telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నల్ల కుబేరులపై బిగుస్తున్న ఉచ్చు.. 50 మంది జాబితా సిద్ధం చేసిన స్విస్!

Hyderabad Police Seize Three Crores

స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా డబ్బు దాచుకున్న నల్ల కుబేరులపై కొరడా ఝళిపించేందుకు భారత్ , స్విట్జర్లాండ్ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని జమచేసిన సుమారు 50 మంది భారతీయుల వివరాలను భారత దేశానికి అందజేసే ప్రక్రియను స్విస్ అధికారులు ప్రారంభించారు.స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ అనే పేరును తొలగించుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కృషి చేస్తోంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 నుంచి చేస్తున్న కృషి వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా మరింత పటిష్టమయ్యాయి.కొద్ది వారాల క్రితం సుమారు 50 మంది భారతీయులకు నోటీసులు జారీ చేసినట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. వీరి వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకోవడానికి స్విస్ ప్రభుత్వ ప్రతిపాదనపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వీరిని కోరినట్లు తెలిపింది.

Related posts