telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కూతురిని పరిచయం చేస్తున్న “మహానటి” నిర్మాత

Swapna-Dutt

సావిత్రి జీవిత నేప‌థ్యంలో “మ‌హాన‌టి” అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. చైనాలోని షాంగై లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌యిన తొలి ఇండియ‌న్ సినిమాగా “మ‌హాన‌టి” అరుదైన ఘ‌న‌త సాధించింది. తన అసమాన నటనతో ప్రేక్షకుల గుండెల్లో `మహానటి`గా శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు సావిత్రి. తన నటనతో కొన్ని తరాలను ప్రభావితం చేసిన సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బేన‌ర్‌పై స్వ‌ప్న‌ద‌త్‌, ప్రియాంక ద‌త్ నిర్మించారు. 2018 సంవత్సరానికిగాను 66వ జాతీయ పురస్కారాల్లో మహానటి చిత్రం మూడు అవార్డులను గెలుచుకొని అగ్రభాగాన నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు..సినిమాలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా మహానటి పురస్కారాన్ని సాధించింది. ఇంత‌టి మ‌హోన్న‌త చిత్రాన్ని నిర్మించిన ద‌త్ సిస్ట‌ర్స్‌పై ప్ర‌తి ఒక్క‌రు ప్రశంస‌లు జ‌ల్లు కురిపించారు. అయితే మ‌హాన‌టి చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన స్వ‌ప్న‌ద‌త్ 2010 డిసెంబ‌ర్‌లో ప్ర‌సాద్ వ‌ర్మ‌ని వివాహం చేసుకుంది. ఇటీవ‌ల వారికి పండంటి పాప జ‌న్మించ‌గా, ఆ పాప ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప‌కి న‌వ్య వైజ‌యంతి ద‌త్ వేటుకూరి అని పేరు పెట్టిన‌ట్టు పోస్ట్‌లో తెలిపింది. స్వ‌ప్న‌ద‌త్ గ‌తంలో ఎవ‌డే సుబ్ర‌హ్మాణ్యం, సుభాష్ చంద్ర‌బోస్ చిత్రాల‌కి కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది.

Related posts