telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అవుటర్ రింగురోడ్డుపై కారుతో పరారైన స్వామీజీ డ్రైవర్

New couples attack SR Nagar

శ్రీశైలంలోని విశ్వనాథ పీఠాధిపతి విశ్వనాథ్ స్వామీజీ అవుటర్ రింగురోడ్డు మీదుగా మేడ్చల్‌ వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో శామీర్‌పేట మండలంలోకి రాగానే మూత్ర విసర్జన కోసం స్వామీజీ కారును ఆపమన్నారు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్ కిరణ్ కారుతో పరారయ్యాడు. కారులో రూ.40 వేలు ఉన్నట్టు స్వామీజీ తెలిపారు.

స్వామీజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. కారుతో పరారైన డ్రైవర్ పటాన్‌చెరు టోల్‌గేట్ సమీపంలో వాహనాన్ని వదిలేసి అందులోని రూ.40 వేలు తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును స్వామీజీకి అప్పగించారు. డ్రైవర్‌ కిరణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts