మంచిర్యాల జిల్లాలో స్మగ్లర్లకు సహకరించిన ముగ్గురు బీట్ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండు చేశారు. జన్నారం ఫారెస్ట్ డివిజన్లోని ముగ్గురు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్టు ఎఫ్డీవో మాధవరావు మంగళవారం తెలిపారు. ఈనెల 8న రాత్రి తాళ్లపేటకు చెందిన స్మగ్లర్ తెంపుల (దుర్గం) రామయ్యతోపాటు మరో ఇద్దరు బీర్సాయిపేట నుంచి కారులో అక్రమంగా తొమ్మిది టేకు దుంగలను తరలిస్తుండగా హాజీపూర్ పోలీస్స్టేషన్ వద్ద హైదరాబాద్కు చెందిన విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
కారుతో పాటు ఆటో, ఓ ద్విచక్రవాహనాన్ని, కలపను స్టేషన్కు తరలించి లక్షెట్టిపేట రేంజ్ అధికారులకు సమాచారమిచ్చారు. విచారణలో భాగంగా స్మగ్లర్ల వద్ద దండేపల్లి, పైడిపల్లి బీట్ ఆఫీసర్లు తరాల సాగర్, ఐతె సత్తయ్య ఫోన్ నంబర్లు ఉండటమే గాక వారితో మాట్లాడినట్టు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్టు డీఎఫ్వో వెల్లడించారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారనే అభియోగంపై తాళ్లపేట బీట్ ఆఫీసర్ ముజీబుద్దీన్ను కూడా సస్పెండ్ చేశామని తెలిపారు.
కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది: ఎంపీ కోమటిరెడ్డి