telugu navyamedia
సినిమా వార్తలు

హేమమాలిని నృత్యానికి సుష్మా స్వరాజ్ ఫిదా

ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమం నిన్న వారణాసిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ నేత హేమమాలిని “మా గంగా” థీమ్ పై నృత్యం చేయగా, 90 నిమిషాల పాటు సాగిన కార్యక్రమాన్ని తిలకించిన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయిపోయారు. గంగా నది చరిత్రను, నది ఎలా కలుషితం అవుతుందన్న విషయాన్నీ చక్కగా చూపించారని, హేమమాలిని లైవ్ పెర్ఫార్మన్స్ చూసిన తనకు మాటలు రావడం లేదని, ఇంతటి అద్భుతమైన ప్రదర్శనను తొలిసారిగా చూస్తున్నానంటూ ప్రశంసల వర్షం కురిపించారు సుష్మ. ఈ నృత్యాన్ని అసిత్ దేశాయ్, ఆయన కుమారుడు అలాప్ దేశాయ్ కంపోజ్ చేశారు. పాటలను సురేష్ వాడేకర్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్, మీకాసింగ్ లు ఆలపించారు. నీతాలుల్లా డిజైన్ చేసిన దుస్తులతో హేమమాలిని మెరిసిపోగా, విభోరీ ఖండేల్ వాల్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆహూతులను ఆసాంతం అలరించాయి.

Related posts