బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్కు సన్నిహితులైన 14 మందిని ఇప్పటికే విచారించారు. సుశాంత్ గాళ్ఫ్రెండ్ రియా చక్రవర్తిని దాదాపు 9 గంటలపాటు విచారించారు. ఈ విచారణలో రియా కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. తనను రిజెక్ట్ చేసిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి పని చేయవద్దని రియాను సుశాంత్ కోరాడట. వెంటనే ఆ సంస్థతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడట. ఆ విషయమై విభేదాలు తలెత్తడంతో ఈ నెల 8వ తేదీన సుశాంత్ ఇంటి నుంచి రియా వెళ్లిపోయిందట. బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఫోన్ ద్వారా సుశాంత్తో టచ్లోనే ఉన్నానని ముంబై పోలీసులకు రియా చెప్పిందట. మిగిలిన వారు కూడా సుశాంత్ గురించిన కీలక విషయాలను ముంబై పోలీసులకు వెల్లడించారట.
previous post
next post
చిరంజీవితో సినిమా ఆగిపోవడానికి అసలైన కారణం… సీక్రెట్స్ వెల్లడించిన వర్మ