బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14వ తేదీన మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. యాహూ 2020 ఇయర్ ఇన్ రివ్యూ అనే కార్యక్రమంలో భాగంగా 2020లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన న్యూస్ మేకర్స్ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మోస్ట్ సర్చ్డ్ పర్సనాలిటీగా స్థానాన్ని బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సొంతం చేసుకొన్నారు. యాహూ ఇండియా సెర్చ్ ఇంజన్ రిలీజ్ చేసిన గణాంకాల్లో సుశాంత్ అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి కోసం నెటిజన్లు భారీగా ఇంటర్నెట్లో శోధించినట్టు స్పష్టమైంది. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ఖాన్, నటుడు ఇర్ఫాన్ఖాన్, రిషీ కపూర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సోనూసూద్, అనురాగ్ కశ్యప్, రియా చక్రవర్తి, కంగన రనౌత్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు తదితరులు ఉన్నారు. అయితే సుశాంత్ మరణించి చాలా రోజులు అవుతున్న.. ఇంకా అతని గురించి ప్రజలు వెతుకుతున్నారు.
next post
జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింది: ఉప రాష్ట్రపతి వెంకయ్య