సూర్య హీరోగా నటించిన “ఎన్.జి.కె” చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్యక్రమంలో ఆయన సినిమా గురించిన విషయాలు మాట్లాడిన తర్వాత అభిమానులకు చిన్న మెసేజ్ను కూడా ఇచ్చారు. “నేను అభిమానులకు రెండు విషయాలను చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా మనం ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? పక్కనోడు ఏం చేస్తున్నాడు? అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ పక్కనోడి కంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి. వేరే వ్యక్తిని వ్యక్తిగత విమర్శ చేయవద్దు. మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి. అలా చేసుకుంటే మనకు అభివృద్ధి ఉంటుంది. మీరు అందరూ అలాగే ఉండాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకు ప్రభుత్వం, దేశం ఏం చేస్తుంది? అనే దాని కంటే మనం దేశానికి ఏం చేస్తున్నామనే దాని గురించి ఆలోచించాలి. భూటాన్ దేశంలో జి.ఎన్.హెచ్ అనే పద్ధతిని ఫాలో అవుతారు. అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. మన దేశంలోని అన్ని రాష్ట్రాలు అదే పద్ధతిని ఫాలో కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు సూర్య.
previous post