telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ టాప్..చంద్రబాబు 14వ స్థానం: సివోటర్స్ సర్వే

Chandrababu fire to CM KCR

దేశంలోని 22 మంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారు. సివోటర్స్, ఐఎఎఎన్ఎస్ నిర్వహించిన సర్వేలో ఓటర్లు కేసీఆర్ కు రేటింగ్ లో అగ్రస్థానం కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 20,827 మంది ఓటింగులో పాల్గొనగా 68.3 శాతం మంది కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 19,900 మంది ఓటింగులో పాల్గొనగా తాము చంద్రబాబు పాలనతో సంతృప్తి చెందుతున్నట్లు 41.7 శాత మంది చెప్పారు. 28.2 శాతం మంది ఫరవాలేదని చెప్పారు .28.6 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

తర్వాత స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి పలనిస్వామి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి టీఎస్ రావత్ రేటింగ్ లో దిగువ స్థాయిలో నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పాలన పట్ల 42 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరే ఉన్నారు. అందులోనూ ఒకరు మాత్రమే టాప్-3లో చోటు సంపాదించుకోగా.. పదో స్థానంలో అసోం సీఎం శర్బానంద సోనోవాల్ నిలిచారు. ఐదోస్థానంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌బఘేల్, ఆరోస్థానంలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్, ఏడోస్థానంలో కర్ణాటక సీఎం కుమారస్వామి, తొమ్మిదోస్థానంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.

Related posts