telugu navyamedia
రాజకీయ

అనిల్‌ అంబానీకి సుప్రీం షాక్ ..450 కోట్లు చెల్లించకుంటే జైలుకే!

supreme court two children petition
రిలయన్స్ గ్రూప్ సంస్థ ఛైర్మెన్ అనిల్ అంబానీకీ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఎరిక్సన్ సంస్థకు రూ.450 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎరిక్సన్ కంపెనీ అనిల్ అంబానీపై  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు  బుధవారం విచారణ జరిపి అంబానీకి షాక్‌ కలిగేలా తీర్పును వెలువరించింది. ఎరిక్సన్ కంపెనీకి రూ. 450 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 
ఈ డబ్బులను చెల్లించకపోతే  మూడు మాసాల పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుదని కోర్టు స్పష్టం చేసింది. అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకుగాను రూ. కోటి రూపాయాలను చెల్లించాలని ఆదేశించింది. ఎరిక్సన్ కంపెనీకి గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి బకాయిలను చెల్లించాలని కోర్టు తెలిపింది. ఈ ఆదేశాలను గత ఏడాది  అక్టోబర్ 28వ తేదీన వెలువరించింది.  ఆలస్యంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తే ఏడాదికి 12 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని కూడ సుప్రీం కోర్ట్ తీర్పులో వెల్లడించింది.

Related posts