telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమిత్ షా, మోడీపై .. చర్యల విషయమై .. సుప్రీం సీరియస్ ..

supreme court two children petition

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు .. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చేసిన ప్రసంగాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈసీ ఎటువంటి చర్యలు చేపట్ట లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోదీ, అమిత్ షాలపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈసీకి డెడ్ లైన్ విధించింది. మోదీ, అమిత్ షాలపై వచ్చిన ఫిర్యాదులపై ఈ నెల 6లోపు నిర్ణయం తీసుకోవాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే ఈసీకి అందిన ఫిర్యాదుల్లో రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని, మరో 9 ఫిర్యాదులపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టుకు ఈసీ స్పష్టం చేసింది. ఆ ఫిర్యాదులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ ఆదివారం వరకు సమయం ఉన్నందున మిగిలిన ఫిర్యాదులపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఈసీికి సూచించిన సుప్రీంకోర్టు, ఈ కేసు విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.

Related posts