telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

మతాంతర వివాహ హక్కులపై.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు…

supreme court two children petition

ఇటీవల కాలంలో మతాంతర వివాహాలు ఎక్కువే జరుగుతున్నాయి. దీనితో ఆయా దంపతులకు వారివారి కుటుంబాల ఆస్తులపై హక్కుల గురించి ఉన్న అనేక అనుమానాలు తాజాగా కోర్టు వెలువరించిన తీర్పుతో నివృత్తి అయిపోయాయి. ఈ హక్కులపై స్పష్టత లేకపోవటంతో, అనేక వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ మతాంతర వివాహం విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ-ముస్లిం వివాహబంధంలో అమ్మాయికి భర్త ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ శాంతనగౌడర్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఆమె భరణం పొందేందుకు మాత్రం అర్హురాలని తెలిపింది. ఈ దంపతులకు పుట్టిన కుమారుడికి తండ్రి ఆస్తిపై అందరిలాగే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. కేరళకు చెందిన ఇలియాజ్ అనే వ్యక్తి ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి షంషుద్దీన్ అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి చనిపోవడంతో అత్తింటివారు వీరిని పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో షంషుద్దీన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి ఆస్తిని తమకు ఇప్పించాలని కోరారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తల్లికి ఆస్తిపై ఎలాంటి హక్కు లేకపోయినా భరణం పొందవచ్చని తెలిపింది. సాధారణ పెళ్లిలాగానే ఇలాంటి అరుదైన మతాంతర వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తండ్రి ఆస్తిపై సంపూర్ణ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో ఇలియాజ్ తండ్రి తరఫు బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలియాజ్ భార్య హిందువు కాబట్టి ఆస్తి దక్కదని వాదించారు. వీరి వాదనలను తిరస్కరించిన ధర్మాసనం.. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Related posts