ఏపీ ప్రభుత్వ తరపు లాయర్.. పంచాయతీ ఎన్నికల పిటిషన్ను త్వరగా విచారించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును నిలుపుదలయ చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది ఏపీ సర్కార్.. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో కొన్ని తప్పులు ఉన్నాయని.. వాటిని సరిచేసే విషయంలో కొన్ని సూచనలు చేసింది అత్యున్నత న్యాయస్థానం.. అయితే, ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిగే అవకావం ఉంది. కాగా, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోన్న సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఏపీ హైకోర్టు తీర్పును వెంటనే నిలుపుదల చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం.. ఫిబ్రవరి మొదటివారంలో పోలీసులకు వ్యాక్సినేషన్ ఉంటుంది… ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలను నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి… ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రేపు ఆదివారమే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. మళ్లీ పిటిషన్ దాఖలు చేసినా.. సోమవారం విచారణ జరగనుంది.. అంటే, ఆ లోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
previous post