కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఈరోజు నోటీసులు జారీచేసింది.రఫేల్ డీల్ అంశంలో మోదీ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని రాహుల్ వ్యాఖ్యల పై స్పందించిన కోర్ట్ ఈ నెల 22లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని పేర్కొంది. బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి కోర్టు ధిక్కారానికి రాహుల్ పాల్పడ్డారని , ఆయనపై చర్యలు తీసుకోవాని పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఫ్రాన్స్ తో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు రాహుల్ గాంధీ గత కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రఫేల్ పత్రాల ఆధారంగా గతంలో రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది.